Sunday, November 30, 2008

వేమన శతకం - ఐదవ బాగం

ఎరుకమాలు వాడు ఏమేమి చదివిన
చదివినంత సేపు సద్గుణియగు
కదిసి తామరాయందు కప్పగూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: జ్ఞానంలేని వాడు ఎన్నిగొప్పగ్రంధాలు చదివినా చదువుతున్నంతసేపే సచ్చీలుడుగా వెలుగుతాడు. ఎలా? తామరపువ్వులో కప్ప కూర్చొని తాత్కాలిక గౌరవం పొందినట్లు.
-------౦౦౦--------

నీళ్ళలోన ముసలి నిగిడి ఏనుగుబట్టు
బైట కుక్కచేత భంగపడును
స్థాన బలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: నీళ్ళలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును సైతం అవలీలగా పట్టుకొంటుంది. అదే నేలమీదకు వచ్చిందా కుక్కకు కూడా లోకువవుతుంది. ఆ బలం గాని , ఈ బలహీనత గాని స్థానం వల్ల వచ్సినవే గాని తన సొంతం కాదు.
-------౦౦౦-------

చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యే
నీట బడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: ముత్యపు చిప్పలో బడిన స్వాతి చినుకు, ముత్యముగా మారుతుంది. నీతి లో బడ్డ చినుకు వ్యర్థం అవుతుంది. ప్రాప్తి ఉంటే తప్పకుండా లాభం కలుగుతుంది.

No comments: