Saturday, April 11, 2009

సుమతీ శతకం - పదకొండవ బాగం

కసుగాయ గఱచి చూచిన
మసలక తన యొగరు గాక మధురంబగునా?
పసగలుగు యువతు లుండగ
బసిబాలల బొందువాడు పశువుర సుమతీ!

బావం :: పండిన పండు తినక పచ్చికాయను కొరికినచో వెంటనే వగరు పుట్టును కానీ మధురంగా ఉండదు. అట్లే యవ్వనవతులైన స్త్రీలుండగా పసిబాలలతో సంబోగించుట వికటమనిపించును. ఆట్టివాడు పశువుతో సమానం.
-------00-------

కవిగాని వాని వ్రాతయు
నవరస భావములేని నాతుల వలపుం
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ!

బావం :: నవరస భావములు లేకుండా, కవిత్వము నేర్వని వాడు వ్రాసిన వ్రాతయు, స్త్రీలయొక్క ప్రేమ, తనకు ముందుగా పరుగెత్తుతున్న పండిని కొట్టలేని మానవుని నానవిధ ఆయుధములను వాడుట యందలి నేర్పరితనము వ్యర్థము.
-------000-------

కాదుసుమీ దుస్సంగతి
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్,
వాదుసుమీ యప్పిచ్చుట
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!

బావం :: దుర్జనుడితో స్నేహం చేయరాదు. కీర్తివచ్చినను పిదప నశించదు. అప్పులిచ్చుట తగవులకు మూలము. స్త్రీలకడ కొద్దిమాత్రము కూడా ప్రేమ ఉండదు.