Friday, March 13, 2009

వేమన శతకం - పదవ బాగం

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళ్కు బెళ్కు రాళ్ళు తట్టెడేల
చాటు పద్య మిలను చాలదా యొకటైన
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: తళతళ మెరిసే రంగు రాళ్లు తట్టెడు ఉండటంకన్నా జాతి నీలమణి ఒక్కటి ఉన్ననూ మన్చిది. ఆ రీతిగనే సారములేని వందలాది పద్యములు చదవడం కంటే సారముగల ఒక్క చాటు పద్యం మేలు.
-------౦౦౦-------

చిత్తశుద్దిగల్గి చేసిన పుణ్యంబు
కొంచెమయున నదియు గొదువ గాదు
విత్తనంబు మర్రి వృక్షంబున నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: మంచి మనసుతో చేసిన పుణ్యము కొంచెమైననూ ఫలితం హెచ్చుగా ఉండును. ఎలాగంటే చిన్న మర్రివిత్తనం నుంచి పెరిగిన చెట్టు మహావృక్షం అగును కదా!
-------౦౦౦-------

ప్రియములేని విందు పిండివంటల చేటు  
భక్తి లేని పూజ పత్రి చేటు
పాత్ర మెరుగనీ వి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం :: ఆప్యాయం లేకుండా వింధుబోజనము పెట్టిన పిండివంటకము వ్యర్థమగును. భక్తిలేకుండా పూజచేసిన పూజాసామగ్రి వ్యర్థం. అదేవిదంగా అర్హతలేనివానికి దానము చేసిన ధనము వ్యర్థం అగును.

No comments: