Sunday, December 21, 2008

వేమన శతకం - ఎనిమిదవ బాగం

తప్పులెన్నువారు తండోపతండాలు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: ఎదుటివారిలో తప్పులు మాత్రమే చూసేవారు అసంఖ్యాకంగా ఉంటారు. భూమిపై నివసించే జనులందరిలో తప్పులుంటాయు. మరి తమలోని తప్పులని గ్రహించకుండా ఇతరుల్లొని తప్పులు వెతుకుతారెందుకు?.
-------000-------

తుమ్మచెట్ల ముండ్లు తోడనె పుట్టును
విత్తులోన నుంచి వెడలి నట్లు
మూర్ఖునకునూ బుద్ది ముందుగా పుట్టునో
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: తుమ్మ గింజ లోంచి మొక్కతో పాటు ముల్లు కూడా కలిసే పుడుతుంది. కానీ మూర్ఖుడి విషయంలో ముందుగా మూర్ఖత్వమ్ పుట్టి మూర్ఖుడు తర్వాత పుడతాడు.
-------000-------

మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడతయొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: మనసులో ఒకటి ఉంచుకొని పైకి వేరే మాట్లాడటం, ఒంట్లో ఒక గుణం ఉంచుకొని బయటకు వేరే ల ప్రవర్తించడం లాంటివి చేయువానికి ముక్తి ఎలా కలుగుతుంది?

No comments: